English | Telugu
సిల్క్ స్మిత ఎఫెక్ట్: 'మార్క్ ఆంటోని'కి అదిరే ఓపెనింగ్స్.. విశాల్ కి డే వన్ రికార్డ్..!
Updated : Sep 16, 2023
విశాల్, ఎస్.జె. సూర్య, రీతూ వర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మార్క్ ఆంటోని'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. శుక్రవారం (సెప్టెంబర్ 15) జనం ముందు నిలిచిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే, సిల్క్ స్మిత ఎపిసోడ్ మాత్రం భలేగా కలిసొచ్చింది. ఫలితంగానే.. మార్క్ ఆంటోని తొలి రోజు మంచి వసూళ్ళు చూడడమే కాకుండా.. విశాల్ కి డే వన్ పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది.
మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1. 30 కోట్ల గ్రాస్ ఆర్జించిన ఈ సినిమా.. తమిళనాడులో రూ. 7.75 కోట్ల గ్రాస్ చూసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా పరంగా రూ. 80 లక్షల గ్రాస్, ఓవర్సీస్ లో రూ. 1.70 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా.. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ. 11.55 కోట్ల గ్రాస్ ని, రూ. 5.75 కోట్ల షేర్ ని మార్క్ ఆంటోని మూవీ ఆర్జించింది. శని, ఆదివారాలతో పాటు సోమవారం వినాయక చవితి అడ్వాంటేజ్ కూడా ఉండడంతో.. మార్క్ ఆంటోని ఫస్ట్ వీకెండ్ ప్లస్ లో మంచి ఫిగర్స్ నే రాబట్టే అవకాశముంది. మరి.. మున్ముందు మార్క్ ఆంటోని బాక్సాఫీస్ సందడి ఎలా ఉండబోతోందో చూడాలి.