English | Telugu

సిల్క్ స్మిత ఎఫెక్ట్: 'మార్క్ ఆంటోని'కి అదిరే ఓపెనింగ్స్.. విశాల్ కి డే వన్ రికార్డ్..!

విశాల్, ఎస్.జె. సూర్య, రీతూ వర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మార్క్ ఆంటోని'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. శుక్రవారం (సెప్టెంబర్ 15) జనం ముందు నిలిచిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే, సిల్క్ స్మిత ఎపిసోడ్ మాత్రం భలేగా కలిసొచ్చింది. ఫలితంగానే.. మార్క్ ఆంటోని తొలి రోజు మంచి వసూళ్ళు చూడడమే కాకుండా.. విశాల్ కి డే వన్ పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది.

మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1. 30 కోట్ల గ్రాస్ ఆర్జించిన ఈ సినిమా.. తమిళనాడులో రూ. 7.75 కోట్ల గ్రాస్ చూసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా పరంగా రూ. 80 లక్షల గ్రాస్, ఓవర్సీస్ లో రూ. 1.70 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా.. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ. 11.55 కోట్ల గ్రాస్ ని, రూ. 5.75 కోట్ల షేర్ ని మార్క్ ఆంటోని మూవీ ఆర్జించింది. శని, ఆదివారాలతో పాటు సోమవారం వినాయక చవితి అడ్వాంటేజ్ కూడా ఉండడంతో.. మార్క్ ఆంటోని ఫస్ట్ వీకెండ్ ప్లస్ లో మంచి ఫిగర్స్ నే రాబట్టే అవకాశముంది. మరి.. మున్ముందు మార్క్ ఆంటోని బాక్సాఫీస్ సందడి ఎలా ఉండబోతోందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.