English | Telugu

బిగ్‌బాస్‌లో మరోసారి ‘ఆ’ ముద్దు ప్రస్తావన తెచ్చిన మన్నారా!

ఆమధ్య డైరెక్టర్‌ ఎ.ఎస్‌.రవికుమార్‌చౌదరి హీరోయిన్‌ మన్నారా చోప్రాను ముద్దు పెట్టుకున్న విషయం వైరల్‌ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో విపరీతంగా సర్క్యులేట్‌ అయ్యాయి. అంతగా వైరల్‌ అయిన ‘ముద్దు’ విషయాన్ని మరోసారి బిగ్‌బాస్‌లో ప్రస్తావించింది మన్నారా చోప్రా. ‘ఒక పబ్లిక్‌ ఫంక్షన్‌లో మా డైరెక్టర్‌ నన్ను ముద్దు పెట్టుకోవడం అందరూ చెడుగా ఆలోచిస్తున్నారు. కానీ, రవికుమార్‌ నన్ను చాలా కాలం తర్వాత చూశాడు. ఒక ఎదిగిన పసిపాపను ముద్దు పెట్టుకున్నాడు తప్ప ఇందులో చెడు ఉద్దేశం ఏమీ లేదు. పిల్లలకు మనం ఇచ్చే పెక్‌ లాంటిది అది.

తాజాగా ఈ విషయాన్ని సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ 17లో ఇంటి సభ్యురాలిగా చేరింది మన్నారా. సల్మాన్‌ఖాన్‌తో సరదా చాట్‌ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంలో ముద్దు వ్యవహారాన్ని ప్రస్తావించింది. ఇక బిగ్‌బాస్‌ విషయానికి వస్తే హౌస్‌ నియమాలను వివరించే టాస్క్‌ మన్నారా చోప్రాకి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె తన కోసం ఇంటి లోపల విలాసవంతమైన చోటును ఎంచుకుంది. మన్నారాకి సినీ కెరీర్‌ అంత ఆశాజనకంగా లేదు. ఇప్పుడు బిగ్‌బాస్‌ షోలో ఎంటర్‌ అయ్యింది కాబట్టి దీని తర్వాత తన కెరీర్‌ గ్రాఫ్‌ పెరిగే అవకాశం ఉంటుందని ఆమె ఆశిస్తోంది. మరి ఈ షో ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.