English | Telugu

పవన్ కళ్యాణ్ వల్లే విలన్ గా మారాను.. మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు   

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ కి 'మంచు మనోజ్'(Manchu Manoj)రూపంలో సరికొత్త ప్రతి నాయకుడు దొరికిన విషయం తెలిసిందే. 'మిరాయ్'(Mirai)సక్సెస్ రేంజ్ పెరగడానికి మనోజ్ విలనిజం కూడా ప్రధాన కారణం. దీన్ని బట్టి మనోజ్ నట విశ్వరూపం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. హీరోగా సత్తా చాటిన మనోజ్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లోకి మారడం ఏంటని కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పడు వాళ్లే మనోజ్ ప్రతి నాయకుడుగా నెక్స్ట్ చిత్రం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అసలు మనోజ్ ని ప్రతినాయకుడిగా మారమని ఎవరైనా చెప్పారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది.

రీసెంట్ గా 'మంచు మనోజ్' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారిని నేను చాలా సార్లు కలిసాను. అలా కలిసినప్పుడల్లా ఆయన నాతో మాట్లాడుతు మనోజ్ నువ్వు నెగిటివ్ రోల్ లో చేస్తే చూడాలని ఉంది. నువ్వు విలన్ గా మారితే మాములుగా ఉండదు. బిజీ అవుతావని చెప్పారని మనోజ్ వెల్లడి చేసాడు. సుదీర్ఘ కాలం నుంచి పవన్, మనోజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్నీ ఇద్దరు చాలా సార్లు బహిరంగంగానే చెప్పారు. మా ఎలక్షన్స్ టైంలో మనోజ్, పవన్ ల అనుబంధానికి సంబంధించిన వీడియో వైరల్ గాను మారింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.