English | Telugu

మన శంకర వరప్రసాద్ గారు అసలు కథ.. చిరంజీవి క్యారక్టర్ ఇదే 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad Garu).'పండక్కి వస్తున్నాం' అనేది టాగ్ లైన్. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ఐమాక్స్ లో అభిమానుల సమక్షంలో టైటిల్ ని ప్రకటించడంతో పాటు కొన్ని గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. సదరు గ్లింప్స్ లో ఆఫీసర్ లుక్ తో ఉన్న చిరంజీవి పెద్ద కారులో నుంచి దిగాడు. సూటు, బూటు, మెళ్ళో టై, ఐడి కార్డు ధరించిన చిరంజీవి సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా నడుస్తున్నాడు. వెనక పెద్ద పెద్ద గన్స్ చేతబూని, కమాండర్ డ్రెస్ లో, కొంత మంది చిరంజీవిని ఫాలో అవుతున్నారు. దీంతో పాటు చేతిలో గన్ తో మెట్లు దిగుతూ వస్తున్న చిరంజీవి, గుర్రంతో ఉన్న చిరంజీవి గ్లింప్స్ కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది.

టైటిల్ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతు మూవీలో 'చిరంజీవి' గారు ఇంటిలెజన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఫ్యామిలీ డ్రామా, ఎంటర్ టైన్ మెంట్ ఒక లెవల్లో ఉండనుంది. మనం ఎంచుకున్న కథ ప్రకారం లుక్ డిజైన్ అవుతుంది.దీంతో కథకి తగ్గ క్యారక్టర్ కోసం చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు. ఆయన లుక్ వల్లే సినిమా చాలా బాగా వస్తుంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని చెప్పుకొచ్చాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి ల చిత్రం ప్రకటించినప్పటి నుంచి కథ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా అనిల్ రావిపూడినే చిరంజీవి క్యారక్టర్ గురించి చెప్పడంతో పాటు ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కబోతుందన్న విషయం అర్ధమవుతుంది. అనిల్ రావిపూడి గత బ్లాక్ బస్టర్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం 'లో 'వెంకటేష్'(Venkatesh)పోలీస్ ఆఫీసర్ గా చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార(Nayanthara)జంటగా చేస్తున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' లో విక్టరీ వెంకటేష్ కూడా ఒక క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్నీ అనిల్ రావిపూడి నే అధికారకంగా ప్రకటించాడు. భీమ్స్ సిసోరియా మ్యూజిక్ ని అందిస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతు చిరంజీవి గారిని నా కంటి తో ఎలా చూడాలని అనుకున్నానో అలా చూసే అవకాశం నాకు వచ్చింది. తప్పకుండా మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి అందరకి నచ్చుతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.