English | Telugu

పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవి వెనక్కి తగ్గారా..?

స్టార్ హీరోలకు ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు ఎదురవుతుంటాయి. త్వరలో విడుదల కాబోయే సినిమా కంటే కూడా.. ఆ తర్వాత రాబోయే సినిమాపై ఎక్కువ అంచనాలు ఏర్పడతాయి. ఆ సమయంలో హీరోలకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అటువంటి పరిస్థితే ఎదురైంది. (Pawan Kalyan)

రీసెంట్ గా 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో 'ఓజీ'తో అలరించనున్నారు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో.. 'ఓజీ'ని ఓన్ చేసుకున్నంతగా పవన్ అభిమానులు 'వీరమల్లు'ని ఓన్ చేసుకోలేదని చెప్పాలి. 'వీరమల్లు' ప్రమోషన్స్ సమయంలో కూడా ఫ్యాన్స్ "ఓజీ ఓజీ" అని పదే పదే అరిచేవారు. దీంతో స్వయంగా పవన్ కళ్యాణే 'రెండూ మన సినిమాలే' అని చెప్పాల్సి వచ్చింది.

అయితే పవన్ ఎంత చెప్పినా అభిమానులు 'వీరమల్లు'ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారనే చెప్పాలి. జూలై 24న విడుదలైన వీరమల్లు.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై ట్రోల్ వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఎప్పటిలా ఈ సినిమాని భుజాన మోసి.. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ కనీస వసూళ్లను ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు 'విశ్వంభర' సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవిని ఆలోచనలో పడేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Chiranjeevi)

చిరంజీవి నుంచి తదుపరి రాబోతున్న రెండు చిత్రాలు.. ఒకటి 'విశ్వంభర' కాగా, మరొకటి 'మన శంకరవరప్రసాద్ గారు'. 'విశ్వంభర' అనేది వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ.. దీని కంటే 'మన శంకరవరప్రసాద్ గారు'పైనే అభిమానుల్లో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అందుకే 'విశ్వంభర'ను ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి 'విశ్వంభర' ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం, వీఎఫ్ఎక్స్ వర్క్ వంటి కారణాలతో వాయిదా పడింది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీంతో 'విశ్వంభర' ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా 2026 వేసవికి వాయిదా పడింది. ఓ రకంగా ఇది తెలివైన నిర్ణయమని చెప్పవచ్చు.

2026 సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' విడుదలవుతోంది కాబట్టి.. ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. పైగా 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన సినిమా కాబట్టి.. ఏదో కంగారు కంగారుగా పూర్తి చేసి విడుదల చేస్తే.. అనవసరంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వీఎఫ్ఎక్స్ కి తగినంత సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదలైన 'విశ్వంభర' స్పెషల్ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ ను గమనిస్తే.. టీజర్ కంటే చాలా బెటర్ గా ఉంది. సినిమా అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో చివరి మూమెంట్ లో 'వీరమల్లు'ని వేగంగా పూర్తి చేసి విడుదల చేశారు. అదే వీఎఫ్ఎక్స్ పై ట్రోల్స్ కి కారణమైంది. అందుకే, 'విశ్వంభర' విషయంలో ఆ తప్పు జరగకూడదని పక్క ప్లాన్ తో వెళ్తున్నట్లు సమాచారం. మొత్తానికి.. సైలెంట్ గా వచ్చి, సాలిడ్ అవుట్ పుట్ తో అందరినీ సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతోనే.. చిరంజీవి వెనక్కి తగ్గినట్లు వినికిడి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .