English | Telugu

అంతా వీఎఫ్ఎక్స్ మహిమేనా.. చిరంజీవి లుక్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఈ సోషల్ మీడియా యుగంలో స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో లుక్ పరంగా ఏ చిన్న తేడా వచ్చినా ట్రోల్స్ ఎదుర్కోక తప్పదు. పోనీ లుక్ బాగుంటే సేఫ్ అని అనుకోడానికి కూడా లేదు. లుక్ బాగున్నా కూడా.. అంతా గ్రాఫిక్సే అనే విమర్శలు ఎదురవుతుంటాయి. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ కొంతకాలంగా ఇటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఫిట్ గా కనిపించడం కోసం వారు వీఎఫ్ఎక్స్ ని నమ్ముకుంటున్నారని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి విషయంలోనూ ఇదే జరుగుతోంది.

చిరంజీవి వయసు 70 ఏళ్ళు. ఇప్పటికీ ఈ తరం హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా లుక్ పరంగా అసలు 70 ఏళ్ళు అంటే నమ్మేలా లేకుండా చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ లో అయితే.. చిరంజీవి లుక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేశాయి. ఈ వయసులో ఇంత ఫిట్ గా ఉండటం ఎలా సాధ్యమని ఆశ్చర్యపడేలా ఆయన కనిపించారు.

'మన శంకరవరప్రసాద్ గారు'లో చిరంజీవి లుక్ వీఎఫ్ఎక్స్ అని కామెంట్స్ వస్తాయని దర్శకుడు అనిల్ రావిపూడి ముందే ఊహించారేమో. చిరు లుక్ గురించి టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

"ఈ సినిమాలో లుక్ పరంగా క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికే ఇస్తాను. ఆయన లుక్ కోసం మేము వీఎఫ్ఎక్స్ చేసిందేమీ లేదు. 90-95 శాతం ఒరిజినల్. చిరంజీవి గారు బాగా వెయిట్ లాస్ అయ్యి, లుక్ పరంగా ఎంతో కేర్ తీసుకున్నారు. నా అదృష్టం.. నాకు ఆ లుక్ దొరికింది. ఈ క్రెడిట్ చిరంజీవి గారికే దక్కుతుంది. ఉదయం, సాయంత్రం జిమ్ చేసి బాగా కష్టపడుతున్నారు. అందుకే 45-50 ఏళ్ళ వ్యక్తిలా కనిపిస్తున్నారు." అని అనిల్ రావిపూడి అన్నారు.

మరి ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని రావిపూడి ఈ కామెంట్స్ చేశారా? లేక భవిష్యత్ లో ట్రోల్స్ రాకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ కామెంట్స్ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.