English | Telugu

ఉత్తమ నటుడు మహేష్‌కి అపఖ్యాతి తెచ్చిన ‘శ్రీమంతుడు’!

సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌, జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మించిన సూపర్‌హిట్‌ మూవీ ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం 7 ఆగస్ట్‌, 2015లో విడుదలైంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని ఎలా అభివృద్ధి చేశాడు అనే ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో లవ్‌, ప్యామిలీ సెంటిమెంట్‌, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలను పొందుపరిచి ఒక కమర్షియల్‌ సినిమాగా రూపొందించారు కొరటాల శివ. అప్పట్లో ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులతోపాటు ఫిలింఫేర్‌, ఐఫా, సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌, సంతోషం అవార్డ్స్‌.. ఇలా ఎన్నో అవార్డులను గెలుచుకుంది ‘శ్రీమంతుడు’ చిత్రం.

ఇదిలా ఉంటే.. ‘శ్రీమంతుడు’ చిత్ర కథ తనదేనని రచయిత శరత్‌చంద్ర వార్తల్లోకి వచ్చారు. వేమూరి బలరామ్‌ సంపాదకత్వంలో ప్రచురితమవుతున్న స్వాతి మాస పత్రికలో తన రచనలో వచ్చిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించారన సదరు రచయిత 2017లో క్రిమినల్‌ కోర్టును ఆశ్రయించారు. మహేష్‌బాబు, కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్‌ అధినేత నవీన్‌ ఎర్నేనిలపై శరత్‌చంద్ర కేసు వేశారు. 1719/2017 కింద ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తమపై వేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మహేష్‌, కొరటాల శివ, నవీన్‌ హైకోర్టును ఆశ్రయించగా, కేసును ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జడ్జిమెంట్‌ కాపీలను విడుదల చేసింది కోర్టు. దీంతో క్రిమినల్‌ కేసును ఎదుర్కోవడం అని వార్యం అయింది. శరత్‌ చంద్ర తరఫున ప్రముఖ న్యాయవాది చల్లా అజయ్‌, రాజశేఖర్‌ పవని శివకుమార్‌ వాదించారు.

‘శ్రీమంతుడు’ సినిమా హీరో మహేష్‌కి ఎంతో పేరు తెచ్చిన సినిమా. ఉత్తమనటుడిగా అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. నటుడిగా మహేష్‌కి ఎంతో పేరు తెచ్చిన ఈ సినిమా కథ విషయంలో రచయిత శరత్‌చంద్ర కోర్టు వరకు వెళ్ళడంతో బోలెడంత అపఖ్యాతిని మూటకట్టుకున్నారు మహేష్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.