English | Telugu
మహేష్ బాబు పాస్ పోర్ట్ ఎందుకు వైరల్ అవుతుంది
Updated : Apr 5, 2025
ssmb 29(ssmb29)అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒడిస్సా లోని పర్వత శ్రేణుల్లో ఒక షెడ్యూల్ని కంప్లీట్ చేసుకోగా ఆ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)మలయాళ లెజండ్రీ యాక్టర్,దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు చిత్ర బృందం ఒడిస్సా ప్రజలకి ధన్యవాదాలు కూడా తెలిపింది.
ఇక రాజమౌళి కొన్ని రోజుల క్రితం మహేష్ పాస్ పోర్ట్ ని తీసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ఒక పిక్ రిలీజ్ చేసాడు.దాంతో సోషల్ మీడియా మొత్తం ఫన్నీమీమ్స్ తో నిండిపోయింది.రీసెంట్ గా మహేష్ బాబు తన పాస్ పోర్ట్ చూపిస్తు ఒక వీడియోలో కనిపించాడు.దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా'మై పాస్ పోర్ట్ ఈజ్ బ్యాక్, నా పాస్ పోర్ట్ నాకు వచ్చేసింది.నన్ను ఎవరు ఆపలేరు' అనే మీమ్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.దీంతో #ssmb 29 హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ssmb 29 లో విదేశీ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి దుర్గ ఆర్ట్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన కే ఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నాడు.ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.