English | Telugu

మహావతార్ నరసింహ డిలీట్ వీడియో బయటకి.. ఎవరి పని ఇది   

శ్రీ మహావిష్ణువు'(Sri Mahavishnuvu)అవతారాల్లో ఒకటైన 'నరసింహ' అవతారం ఆవిర్భావానికి గల కారణాన్ని వివరిస్తు,ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహావతార్ నరసింహ'(Mahavatar Narsimha)సాధించిన ఘన విజయం తెలిసిందే. ఎప్పట్నుంచో థియేటర్స్ ముఖం చూడటం మానేసిన వాళ్ళని సైతం థియేటర్స్ కి రప్పించింది. అనేక థియేటర్స్ మహావిష్ణువు భజనలతో దేవాలయాలుగా కూడా మారాయి. దీన్ని బట్టి 'మహావతార్ నరసింహ' సృష్టించిన ప్రభంజనం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే పెద్ద చిత్రాలకి సైతం షాక్ ఇస్తు వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయలని రాబట్టింది.

జులై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిన్నటితో యాభై రోజులని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 'మహావతార్ నరసింహ'కి సంబంధించిన డిలీట్ వీడియోని రిలీజ్ చేసింది. సదరు వీడియోలో విష్ణుభక్తిని అణువణువు నింపుకున్న తన కుమారుడు 'ప్రహ్లాదుడు'(Prahlada)ని చంపలేకపోతున్నందుకు, ఏకాంత మందిరంలో ఉన్న హిరణ్యకశిపుడు ఎంతగానో మదనపడుతుంటాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు సురాపానాన్ని తాగుతు ఉన్నాడు. ఆ తర్వాత అద్దంలో తన ప్రతిమ కనపడి, నిన్ను నువ్వు పరాక్రమమైన మహా శక్తిమంతుడిగా భావిస్తావు. కానీ ఐదేళ్ల వయసున్న చిన్నపిల్లవాడ్ని చంపలేకపోతున్నావు. ఈ లెక్కన ఆ విష్ణవు ని ఎలా చంపగలవు. ఇది ఇలాగే కొనసాగితే నీ కోపాన్ని చూసి కుక్క కూడా బయపడదని చెప్పగానే హిరణ్యకశిపుడు కోపంతో అద్దాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ విధంగా నిమిషం ఇరవై తొమ్మది సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.

మహావతార్ నరసింహని క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ ఎంతో భక్తి భావంతో నిర్మించగా అశ్విని కుమార్(Ashwin Kumar)దర్శకత్వం వహించాడు. మహావతార్ ఫ్రాంచైజీ లో భాగంగా తదుపరి 'మహావతార్ పరశురామ్' 2027 వ సంవత్సరంలో 'మహావతార్ రాఘవనందన' (2029), 'మహావతార్ ద్వారకాధీష్' (2031), మహావతార్ గోకులనంద(2033 ), 'మహావతార్ కల్కి పార్ట్ 1 (2035 ) పార్ట్ 2 (2037) లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సామ్ సిఎస్ సంగీత దర్శకుడు. మహావతార్ నరసింహ ఇప్పటికి 200 థియేటర్స్ కి పైగా రన్ అవుతుండటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.