English | Telugu

‘మిరాయ్‌’ చిత్రానికి తేజ సజ్జ రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

పది సంవత్సరాలపాటు బాలనటుడిగా ఎంతో మంది స్టార్‌ హీరోల సినిమాల్లో నటించిన తేజ సజ్జ.. ఇప్పుడు తను కూడా స్టార్‌ హీరోల సరసన చేరిపోయాడు. హీరోగా చేసిన సినిమాలు తక్కువే అయినా అతని రేంజ్‌ మాత్రం తక్కువ కాదు. యూత్‌లోనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు తేజ. అంతకుముందు హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించినా ‘హనుమాన్‌’తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

హనుమాన్‌లో సూపర్‌హీరోగా కనిపించిన తేజ.. ఆ వెంటనే అతనితో ‘మిరాయ్‌’ ప్రాజెక్ట్‌ సెట్‌ అయింది. ఈ సినిమాలో సూపర్‌ యోధగా ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఒక హీరోకి ఇలా వెంట వెంటనే సూపర్‌ పవర్‌ క్యారెక్టర్లు దక్కడం అనేది చాలా అరుదు. అలాంటి ప్రత్యేకమైన క్యారెక్టర్లు తేజను వరించాయి. హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత నాలుగో సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ కొట్టిన తేజ.. ‘మిరాయ్‌’ మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కూడా రికార్డు కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

హనుమాన్‌ సినిమాకి తేజ రెమ్యునరేషన్‌ 2 కోట్లు. ఆ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ‘మిరాయ్‌’ సినిమాకి తన రెమ్యునరేషన్‌ ఎంత పెంచి ఉంటాడు అని లెక్కలు వేసి 10 కోట్లుగా డిసైడ్‌ అయ్యారు. ట్రేడ్‌ వర్గాల్లో కూడా ఇదే టాక్‌ వినిపించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో రెమ్యునరేషన్‌ ప్రస్తావన వచ్చినపుడు తేజ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘ఒక మంచి సినిమాలో నేను కూడా ఒక పార్ట్‌ అవ్వాలనుకుంటాను తప్ప రెమ్యునరేషన్‌ విషయం నేను పెద్దగా పట్టించుకోను. హనుమాన్‌ కోసం నేను పొందినదే.. ఈ సినిమాకి కూడా తీసుకున్నాను’ అన్నారు. దీన్నిబట్టి ఇన్నిరోజులుగా మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న 10 కోట్ల రెమ్యునరేషన్‌ అనే వార్తలో ఎంత మాత్రం నిజం లేదనేది స్పష్టమైపోయింది. వరసగా రెండు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన తేజ.. తన రెమ్యునరేషన్‌ విషయంలో నిర్మాతలకు అందుబాటులో ఉండడం అనేది శుభపరిణామంగానే చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.