English | Telugu

‘లియో’ కలెక్షన్లతో నాకు సంబంధం లేదు : లోకేష్‌ కనకరాజ్‌

‘మా నగరం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ డైరెక్టర్‌ రేంజ్‌కి ఎదిగాడు లోకేష్‌ కనకరాజ్‌. లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ అనే మీడియా ఫ్రాంచైజ్‌ని క్రియేట్‌ చేసి దానిలో ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా సినిమాలను చేస్తూ ఆడియన్స్‌కి చక్కని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తున్నాడు లోకేష్‌. ఎల్‌సియులో భాగంగానే రూపొందిన ‘లియో’ అక్టోబర్‌ 19న దసరా కానుకగా విడుదలైంది. విజయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఒక వివాదం కొన్ని రోజులుగా నడుస్తోంది. లియో యూనిట్‌ సభ్యులు ప్రకటిస్తున్న కలెక్షన్లకు, వాస్తవంగా వున్న కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం లేదని థియేటర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు గత కొంతకాలంగా చెబుతూనే ఉన్నాడు. ఈ కలెక్షన్ల విషయంలో ‘లియో’ టీమ్‌ రూ.5 కోట్ల స్కాం చేసిందని ఆయన ఆరోపించారు. లియో కలెక్షన్ల గురించి మాట్లాడినందుకు థియేటర్‌ కూడా అయిన నిర్మాత లలిత్‌కుమార్‌ తనను బెదిరిస్తున్నాడని అన్నారు. ఈ సినిమా కలెక్షన్ల వివాదం రోజురోజుకీ పెద్ద సమస్యగా మారిపోతోంది.

ఇదిలా ఉండగా, ‘లియో’ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ స్పందిస్తూ ‘నేను థియేటర్లకు వెళ్లి రెస్పాన్స్‌ చూశాను. ఫస్ట్‌హాఫ్‌ ఓకే. సెకండాఫ్‌కి వచ్చేసరికి మిక్స్‌డ్‌ టాక్‌ విన్నాను. సెకండాఫ్‌లో ల్యాగ్‌ వుందని నాకు ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇక కలెక్షన్ల విషయం నాకు సంబంధం లేదు. దాన్ని నిర్మాతలకే వదిలేస్తున్నాను’’ అన్నారు.

సుబ్రమణియన్‌ చెప్పిన విషయంలో వాస్తవం ఉందని ‘లియో’ సినిమా వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే అర్థమవుతుంది. కలెక్షన్ల గురించి టీమ్‌ చెప్పేది ఒకలా ఉంటే.. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఆదివారం అయినా ఒక్క థియేటర్‌ కూడా హౌస్‌ఫుల్‌ అవ్వడం లేదు. సుబ్రమణియన్‌ని సపోర్ట్‌ చేసేవారు ఈ విషయాన్ని హైలైట్‌ చేస్తున్నారు. అయితే సినిమా రిజల్ట్‌ విషయంలో లోకేష్‌ చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.