English | Telugu

ఆది పురుష్ పరిస్థితి అర్థం కావడం లేదు!

భారతీయులు పవిత్ర గ్రంథం గా భావించేది రామాయణం. ఈ మైథ‌లాజిక‌ల్ స్టోరీని మోడ్ర‌నైజ్ చేసి అదే పేరుతో ఆధునికరించడాన్ని మనం జీర్ణించుకోలేం. రామాయణాన్ని మోడ్ర‌ర్నైజ్ చేస్తే దానికి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. రామాయణాన్ని భారతీయులు ఎలా చూడాలని భావిస్తున్నారు అనేది తెలుసుకుని అలానే తీయాలి గాని టెక్నాలజీని ఉపయోగించి ఇష్టా రీతిగా తీస్తామంటే సహించేది ఉండదని ఇప్పటికే ఆది పురుష్ టీంకి హెచ్చరికలు వెళ్లాయి. దాంతో సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఫై మ‌ర‌లా మ‌రోసారి వర్క్ స్టార్ట్ చేశారు. టి సిరీస్ భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ చిత్రానికి వ‌చ్చిన నెగ‌టివిటీకి తోడు ప్రభాస్ చేసిన చివరి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేదు. దీంతో సినిమాకి బ‌య‌ట నుండి వస్తున్న ధియేట్రికల్ ఆఫర్స్ కూడా తగ్గిపోయాయ‌ని స‌మాచారం. ఓవర్సీస్ లో ఆదిపురుష్ మూవీ ని కేవలం 35 కోట్లకు మాత్రమే అడుగుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నుండి వస్తున్న సినిమా అయినా కూడా అంతకుమించి ఇచ్చేందుకు ఎవరు మొగ్గు చూపడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో తాము అనుకున్న బడ్జెట్ కి అనుగుణంగా తీసుకోవ‌డానికి ఎవ‌రైనా వ‌స్తే స‌రి లేక‌పోతే ఈ మూవీని తామే సొంతంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఆ అమౌంట్ కి ఎవ‌రు ముందుకు రాక‌పోతే తామే సరిగమ ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ చేయాలని నిర్మాత భూషణ్ కుమార్ భావిస్తున్నారు. కనీసం ఈ సినిమా ఓవర్సీస్ ద్వారా 100 కోట్లను ఆయన ఆశిస్తున్నాట్లు స‌మాచారం. భూషణ్ కుమార్ కు సినిమాపై భారీగా నమ్మకముంది. ప్రభాస్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా ఇది నిలుస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్న ధ‌ర రాకపోతే నేరుగా ఓన్ రిలీజ్కే మొగ్గు చూపించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.