English | Telugu

లీకైన బాహుబలి స్టోరీ

భారీ అంచనాలతో, భారీ తారాలతో, భారీగా తెరకెక్కుతున్న బాహుబలి చిత్రం ఆడియో కూడా విడుదల కాకముందే ఎంతో హైప్ తెచ్చుకుంది. ఆరడుగుల అందగాళ్లు రానా, ప్రభాస్ రాజుల గెటప్స్‌తో కనిపిస్తున్న ఈ చిత్రకథ ఎలా ఉండబోతుందో అనే విషయం పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని వుంది. అనుష్క, తమన్నా ఇందులో కథానాయికలుగా ప్రముఖపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అడవి శేషు, సుదీప్ వంటి నటులు కూడా వున్నారు. ఈ చిత్రం కోసం, ఈ చిత్రంలో తమ పాత్రల కోసం అందరూ కష్టపడిన వారే.


మరి ఇంత ఎక్సైటింగ్ మూవీ ఎలా వుండబోతుందనే కుతూహలం అందరిలో వుంది. చాలా కాలంగా షూటింగ్ నిర్వహిస్తున్న ఈ యూనిట్ ఈ మధ్యే బ్రేక్ తీసుకుంది. ఈ సమయంలో సినిమా గురించిన కొన్ని విషయలు లీక్ అయినట్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. వాటి ప్రకారం ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో అనుష్క గర్భవతిగా కనిపించనుందట. రానా క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ తర్వాత కనపడదట. ఇక ప్రభాస్ కూడా ఫస్ట్ పార్ట్‌లో చనిపోయి, సెకండ్ హాఫ్‌లో అనుష్కకు కొడుకుగా పుడతాడట. ఆ ప్రభాస్ క్యారెక్టర్‌కి తమన్నా హీరోయిన్. అలాగే ఇందులో రానా కొడుకుగా అడవి శేషు నటిస్తున్నాడని, అతను ప్రభాస్‌‌తో యుద్ధం చేస్తాడట. గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఇద్దరి మధ్య పగతో కూడుకున్న వాతావరణం ఉంటుదని తెలిసిందే. ఈ వివరాలను బట్టి సినిమా కథ మరింత వివరంగా ఎవరికి వారే ఊహించుకోగలరు. ఇక రాజమౌళి రెండు జన్మలు, డబుల్ యాక్షన్ ఫార్ములాని ఇందులో కూడా వాడబోతున్నారని అనిపించకమానదు.


ఈ చిత్రం గురించిన విషయాలేవి బయటకు రాకుండా ఈ చిత్ర బృందం చాలా జాగ్రత్త పడుతూ వస్తోంది. కాబట్టి లీకైన సమాచారం వాస్తవం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.