Read more!

English | Telugu

'ఎన్టీఆర్ 30' స్టోరీ లైన్ ఇదే!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్) సినీ ప్రముఖుల సమక్షంలో గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మూవీ టీమ్ తో పాటు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్, దిల్ రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరో హీరోయిన్లు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కి రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

మూవీ లాంచ్ సందర్భంగా టీమ్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపారు. "ఇండియాలోని మనం మరిచిపోయిన తీర ప్రాంతం నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ వాళ్ళు ఒకే ఒక్క దానికి భయపడతారు. అదేంటో మీకు తెలుసు. ఇది సినిమా నేపథ్యం. ఇదొక గొప్ప ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ వర్క్ అవుతుందని అందరికీ ప్రామిస్ చేస్తున్నాను" అన్నారు. కొరటాల మాటలను బట్టి చూస్తే ఆయనలోని అసలుసిసలైన మాస్ యాంగిల్ ని ఈ సినిమాతో బయటపెట్టబోతున్నారని అర్థమవుతోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.