English | Telugu

రిలీజ్ కి ముందు రోజు షాకిచ్చిన 'కింగ్‌డమ్' టీమ్!

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కింగ్‌డమ్' (Kingdom). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, విజయ్ సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు(జులై 31) థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఓ మంచి భారీ యాక్షన్ సినిమాని చూడబోతున్నామనే నమ్మకాన్ని కలిగించాయి. విజయ్ అభిమానులు, ప్రేక్షకులు కూడా అవే అంచనాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో మూవీ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది.

'కింగ్‌డమ్' విడుదల నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో విజయ్, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా కాదని, ఆడియన్స్ రాంగ్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కు రాకూడదనే ఉద్దేశంతో ఇది చెబుతున్నామని అన్నారు. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇదని, ఇందులో ఆయన శైలి ఎమోషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఇప్పటిదాకా 'కింగ్‌డమ్'ని ఒక యాక్షన్ సినిమాగానే ప్రేక్షకులు చూశారు. అయితే ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్స్ కి పెద్ద పీట వేసినట్లు తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. టీమ్ చెబుతున్నట్టుగా ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే.. కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే అవకాశముంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.