English | Telugu

కింగ్‌డమ్ టార్గెట్ ఇదే.. విజయ్ హిట్ కొడతాడా..?

విజయ్ దేవరకొండ హిట్ కొట్టి దాదాపు ఏడేళ్లు అయింది. 2018లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయ్ ఖాతాలో హిట్ పడలేదు. విజయ్ హీరోగా నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజా చిత్రం 'కింగ్‌డమ్' సంచలన బిజినెస్ చేసింది. (Kingdom)

విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం 'కింగ్‌డమ్'. రేపు(జూలై 31) విడుదలవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ.. 'కింగ్‌డమ్' భారీ థియేట్రికల్ బిజినెస్ చేసింది.

నైజాంలో రూ.15 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్ లో రూ.6 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ.36 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.7 కోట్లు, ఓవర్సీస్ రూ.9.5 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.52.5 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.53 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.

విజయ్ కెరీర్ లో రూ.50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన మూడో సినిమాగా 'కింగ్‌డమ్' నిలిచింది. గతంలో 'లైగర్' రూ.80 కోట్లకు పైగా బిజినెస్ చేయగా, 'ఖుషి' రూ.50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అయితే ఆ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించలేదు. దీంతో ఇప్పుడు 'కింగ్‌డమ్'తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు విజయ్. బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.