English | Telugu

విజయ్ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన కస్తూరి!

భారతీయుడు సినిమా లోని పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు అన్నమయ్య సినిమా లోని ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల అనే ఈ రెండు పాటలు తెలుగువారి ఇళ్లల్లో వినపడుతున్నంత కాలం కస్తూరి ని ఎవరు మర్చిపోరు. చెన్నై కి చెందిన కస్తూరి మిస్ మద్రాస్ టైటిల్ ని కూడా గెలుచుకుంది. చాలా తెలుగు సినిమాల్లో నటించి మన తెలుగు అమ్మాయే అని ప్రేక్షకులు భావించేలా నటించి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించింది. 90 వ దశకం లో తెలుగు లోను తమిళంలోను ఒక వెలుగు వెలిగిన కస్తూరి తాజాగా ఎక్స్ వేదికగా తమిళ నెంబర్ వన్ హీరో విజయ్ కి కొన్ని చురకలు అంటించడం ఇప్పుడు తమిళనాడు మొత్తాన్ని ఒక ఊపు ఊపుతుంది.

దళపతి విజయ్ కి తమిళనాడు లో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. విజయ్ ఒక్క సైగ చేస్తే చాలు ఫాన్స్ ఏమైనా చేస్తారు. ఇంకా గట్టిగ చెప్పాలంటే విజయ్ కోసం ప్రాణాలు అయినా ఇవ్వడానికి రెడీ గా ఉన్న ఫాన్స్ ఎంతో మంది ఉన్నారు
తాజాగా ఆయన కొత్త సినిమా లియో ట్రైలర్ ని తమిళనాడులోని చాలా థియేటర్లుల్లో రిలీజ్ చేసారు. చెన్నై నగరంలోని ఒక థియేటర్ లో కూడా లియో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తమ అభిమాన హీరో ట్రైలర్ రిలీజ్ అయిన ఆనందంలో విజయ్ ఫాన్స్ థియేటర్ లోని సీట్లని కోయడం తో పాటు థియేటర్ ని కూడా చాలా వరకు ద్వంసం చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

ఇపుడు ఈ విషయం మీద కస్తూరి సూటిగా విజయ్ ఫాన్స్ తీరుని ప్రశ్నించడంతో పాటు విజయ్ కి ఒక సలహా కూడా ఇచ్చింది. ఇంతకీ తను ఏమని అందంటే..లియో ట్రైలర్ సందర్భంగా విజయ్ ఫాన్స్ ప్రవర్తించిన తీరుని ఎవరు క్షమించకూడదని పబ్లిక్ ప్రాపర్టీ ని ద్వాంసం చెయ్యడానికి మీరు ఎవరు అని ఒక విజయ్ ఫాన్ గా చాలా బాధపడుతున్నానని ఇట్స్ ఏ షేమ్ అని చాలా ఘాటుగా చెప్పింది.అలాగే నాయకుడుగా ఎదగాలని విజయ్ భావిస్తుంటే కనుక తన ఫాన్స్ ని అదుపులో పెట్టుకోవాలని విజయ్ కి సలహా ఇచ్చింది.మరి విజయ్ అండ్ విజయ్ ఫాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కస్తూరి ప్రస్తుతం చాలా సీరీయల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.