English | Telugu

టాలీవుడ్ స్టార్స్ కి షాకిచ్చేలా 'కాంతార-2' తెలుగు బిజినెస్!

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా హిట్ టాక్ వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ రాబడుతుంటాయి. అలాంటిది ఓ డబ్బింగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమా ఏదో కాదు.. కాంతార చాప్టర్-1.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కాంతార'. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ 2022లో సైలెంట్ గా వచ్చి ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.30 కోట్ల షేర్ తో ఘన విజయం సాధించింది.

ఇప్పుడు కాంతారకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్-1 రూపొందుతోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు తెలుగు రాష్ట్రాల రైట్స్ ని ఏకంగా వంద కోట్లకు కోట్ చేస్తున్నట్లు సమాచారం.

గతంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కేజీఎఫ్-2' కూడా తెలుగునాట రూ.75 కోట్ల బిజినెస్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. సీక్వెల్ హైప్ తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో సత్తా చాటి.. తెలుగు రాష్ట్రాల్లో లాభాలు చూసింది.

ఇప్పుడు 'కాంతార చాప్టర్-1'కి ప్రీక్వెల్ హైప్ తో పాటు, డివోషనల్ టచ్ కూడా ఉండటంతో.. నైజాం రూ.40 కోట్లు, ఆంధ్రా రూ.45 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు చొప్పున మొత్తం వంద కోట్లు కోట్ చేస్తున్నారట. 90 కోట్లకు అటుఇటుగా డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల బిజినెస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన సినిమాగా 'కాంతార చాప్టర్-1' నిలుస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .