English | Telugu

‘కాంత’ వివాదం.. అందరి నోట ఒకటే మాట!

- కోర్టుకెక్కిన త్యాగరాజ భాగవతార్ మనవడు

- కాంత వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

- కాంతపై సోషల్ మీడియాలో పోస్టులు

దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాంత’. వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్‌ మీడియా బేనర్స్‌పై దుల్కర్‌ సల్మాన్‌, రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘కాంత’ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌ ఓ వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. 1930వ దశకంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవిత కథనే ‘కాంత’ చిత్రంగా మలిచారంటూ మీడియాలో, సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో త్యాగరాజ భాగవతార్‌ మనవడు ‘కాంత’ చిత్ర నిర్మాతలపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

నవంబర్‌ 14న ఈ సినిమా విడుదలవుతుండగా త్యాగరాజ భాగవతార్‌ మనవడు కోర్టుకెక్కడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇటీవల చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు గొప్ప వ్యక్తులు తమ బ్రిలియన్స్‌ విషయంలో పడిన గొడవల నేపథ్యంలోనే ఈ కథ ఉంటుంది తప్ప ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు అన్నారు. మరోపక్క ఈ సినిమా ప్రీమియర్స్‌ ఆల్రెడీ వేశారు. మీడియాకి కూడా సినిమాని చూపించారు. ‘కాంత’లో వివాదాస్పద అంశాలు ఏమీ లేవని సినిమా చూసిన వారు తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. త్యాగరాజ భాగవతార్‌ జీవితానికి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి జరిగిన ప్రచారం అర్థం లేనిదని తేల్చారు. దీంతో ‘కాంత’ వివాదానికి తెరపడినట్టుగానే భావించాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.