English | Telugu

ధృవ సీక్వెల్‌కి ముహూర్తం ఫిక్స్!

ధృవ సీక్వెల్‌కి ముహూర్తం ఫిక్సయింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన సినిమా ధృవ‌. ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ త‌మిళ్‌లో తెర‌కెక్కిన త‌ని ఒరువ‌న్‌. ఈ చిత్రంలో అక్క‌డ జ‌యం ర‌వి న‌టించారు. న‌య‌న‌తార నాయిక‌గా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమాకు అక్క‌డ సీక్వెల్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు జ‌యం ర‌వి. ఈ సినిమాను 2024లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామని రీసెంట్‌గా చెప్పారు జయం ర‌వి.

20 ఏళ్లుగా సినిమాల్లో న‌టిస్తున్నారు ర‌వి. ఆయ‌న న‌టించిన అఖిల‌న్ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల చెన్నైలో విడుద‌లైంది. ఈ వేడుక‌లో పాల్గొన్న జయం ర‌వి మాట్లాడుతూ "అఖిల‌న్ సినిమాలో ఆక‌లి గురించి మాట్లాడాం. అంద‌రినీ క‌దిలించే విష‌యాల‌ను ప్ర‌స్తావించాం. త‌ప్ప‌కుండా జ‌నాల‌కు న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉంది. మార్చి 10న విడుద‌ల‌వుతున్న అఖిల‌న్‌ని అంద‌రూ ఆద‌రించండి" అని అన్నారు.

రెండు ద‌శాబ్దాల కెరీర్‌ని వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఏమ‌నిపిస్తోంది అని అడిగితే "నేను ఆగ‌ట్లేదు. వెన‌క్కి తిరిగి చూడ‌ద‌ల‌చుకోలేదు. అలా చూస్తూ కూర్చుంటే, ఇప్పుడున్న క్ష‌ణాల‌ను మిస్ అవుతాం. అందుకే నేను ఆగ‌డం లేదు" అని అన్నారు. భ‌విష్య‌త్తులో మాత్రం జ‌యం ర‌వి చాలా మంచి సినిమాలు చేశార‌ని అందరూ అనుకుంటుంటే వినాల‌ని ఉంద‌ని చెప్పారు.

ఎప్పుడూ టిప్‌టాప్‌గా రెడీ అయ్యే జ‌యం ర‌వి, అఖిల‌న్ ప్రెస్‌మీట్లో కాస్త బ‌రువు పెరిగి, సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించారు. ఈ లుక్ ఏ సినిమా కోసం అని విలేక‌రులు ప్ర‌శ్నించారు. ప్ర‌తిసారీ లుక్ కేవ‌లం సినిమాల కోస‌మే ఉండ‌దు, కొన్నిసార్లు షేవింగ్ చేసుకునే స‌మ‌యం లేక‌పోయినా ఇలా ఉంటుంది అని అన్నారు జ‌యం ర‌వి.

జ‌యం ర‌వి న‌టించిన పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు సీక్వెల్‌ని సిద్ధం చేసే ప‌నుల్లో ఉన్నారు డైర‌క్ట‌ర్ మ‌ణిర‌త్నం. మెడ్రాస్ టాకీస్‌, లైకా సంస్థ క‌లిసి నిర్మిస్తున్నాయి. సీక్వెల్‌ని ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌ల విక్ర‌మ్, జ‌యం ర‌వి, కార్తి మాట్లాడిన బీటీయ‌స్ వీడియో విడుద‌ల చేసింది పొన్నియిన్ సెల్వ‌న్ టీమ్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.