English | Telugu

మొదటి సినిమాకే మాస్ రాజాను ఢీ కొడుతున్నాడు!

వెంకటేష్, రానా బాటలో దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ 'అహింస' చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఏవో కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కానుందని తెలిపారు.

మాములుగా కొత్త హీరో సినిమాని పెద్ద హీరోలతో పోటీ లేకుండా విడుదల చేస్తుంటారు. కానీ దగ్గుబాటి హీరో అభిరామ్ మాత్రం మాస్ మహారాజా రవితేజతో పోటీకి సై అంటున్నాడు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రావణాసుర' కూడా ఏప్రిల్ 7 నే విడుదల కానుంది. అసలే 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. దానికితోడు ఆయన కీలకపాత్రలో నటించిన 'వాల్తేరు వీరయ్య' కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఓ రేంజ్ లో ఫామ్ లో ఉన్న మాస్ రాజాతో అభిరామ్ బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు అదేరోజు యువహీరో కిరణ్ అబ్బవరం నటించిన 'మీటర్' విడుదల కూడా ఉంది. ఈ పోటీ నడుమ అభిరామ్ మొదటి చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.