English | Telugu

దీపావళికి మీ ఇంట్లో రజనీ కాంత్ 

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా అగస్ట్ లో విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సినిమా జైలర్. ఈ మూవీతో రజనీ కాంత్ నటనకి ఉన్న సత్తా ఏ పాటిదో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల అందరికి తెలిసింది. సుమారు 600 కోట్ల రూపాయిల దాకా వసులు చేసిన జైలర్ మూవీకి సంబంధించిన తాజా వార్త రజనీ అభిమానులతో పాటు సినిమా అభిమానులని కూడా ఆనందంలో ముంచెత్తుతుంది.

జైలర్ గా రజనీ ఇప్పుడు బుల్లి తెర మీద తన సత్తాని చాటబోతున్నాడు. దీపావళి కానుకగా ఈ నెల 12 న జైలర్ మూవీ ప్రముఖ టెలివిజన్ ఛానల్ జెమినీలో ప్రసారం కాబోతుంది. తెలుగు, తమిళ,కన్నడ వెర్షన్స్ లో ఈ నెల 12 న సాయంత్రం 6 :30 నిమిషాలకి టెలికాస్ట్ అవ్వనుంది. హిందీ వెర్షన్ మాత్రం ఒక రోజు ముందు అంటే 11 వ తేదీ రాత్రి 7 గంటలకి స్టార్ గోల్డ్ ఛానల్ లో ప్రసారం కాబోతుంది. అయితే మలయాళలో మాత్రం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో అనే అప్ డేట్ లేదు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ జైలర్ మూవీ రజనీకాంత్ సినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం గా నిలిచింది. నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అయిన తన కొడుకుని సంఘవిద్రోహ శక్తులు చంపారని తెలుసుకొని తన కొడుకుని చంపిన వాళ్ళని చంపాలనుకొని బయలుదేరిన తండ్రికి చివరికి తన కొడుకే సంఘవిద్రోహ శక్తి అని తెలిసి ఆ కొడుకుని చంపుకునే క్యారక్టర్ లో రజనీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా రజనీ వీర విహారం చేసాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లు నటించిన ఈ జైలర్ మూవీ లో రజనీ భార్య గా రమ్య కృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో తమన్నా ,సునీల్ లు నటించగా అనిరుద్ సంగీత సారథ్యం వహించాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.