English | Telugu

Allu Arjun : పాయల్ 'మంగళవారం' కోసం అల్లు అర్జున్!

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగుతుండటం విశేషం.

చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. త్వరలో జరగనున్న 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముఖ్య అతిథిగా రావడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత స్వాతి రెడ్డితో బన్నీ కుటుంబానికి మంచి అనుబంధముందట. పైగా ట్రైలర్ చూసి ఫిదా అయిన బన్నీ.. ఇప్పటికే చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడట. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రావడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. నవంబర్ 11న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.