English | Telugu

జబర్దస్త్‌ ఇమ్మానుయేల్‌ను చంపేశారు: యాక్షన్‌.. రియాక్షన్‌

జబర్దస్త్‌లో ఇమ్మానుయేల్‌ తన కామెడీతో అందర్నీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. దాంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అతని కెరీర్‌ సజావుగా సాగిపోతుండగా సడన్‌గా సోషల్‌ మీడియాలో అతని గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఇమ్మానుయేల్‌ చనిపోయాడంటూ ప్రచారం మొదలైంది. ఒకరిని చూసి మరొకరు ఈ వార్తను వైరల్‌ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. దానికి తోడు ఇమ్మానుయేల్‌ మరణం పట్ల వర్ష దిగ్భ్రాంతి చెందిందని, గుండెలు పగిలేలా రోదిస్తోందని కామెంట్స్‌ పెట్టడం మొదలుపెట్టారు.

దీనిపై స్పందించిన ఇమ్మానుయేల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ‘‘అరే చేతకాని కొడుకులు.. నేను నటనం చేస్తే చచ్చిపోయానని రాశారంట.. నా నటనంరా అది. నా నటనం.. చచ్చిపోలేదు నేను.. ఇట్టాంటోళ్లను ఏమంటారో తెలుసా.. చేతకాని కొడుకులు అంటారు. నా వీడియో ఎక్కడి దాకా వచ్చిందో కింద కామెంట్‌ చేయండి.. అరే బాబు నేను చావలేదురా నాయనా.. ప్రేమ వాలంటీర్‌లో సీన్‌రా అది ..’’ అంటూ ఈ విషయంలో సీరియస్‌ అవ్వకుండా సరదాగానే తన సమాధానం చెప్పాడు.

నిజానికి జరిగిందేమిటంటే ఇమ్మానుయేల్‌ ‘ప్రేమ వాలంటీర్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌ చేశాడు. అందులోని అతని నటనకు, కామెడీకీ మంచి మార్కులే పడ్డాయి. ఆ వెబ్‌ సిరీస్‌లోని ఓ సీన్‌ని తీసుకొని కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇమ్మానుయేల్‌ చనిపోయాడని తమ ఇష్టానుసారం చెప్పుకుంటూ పోయాయి. ఇవన్నీ చూసిన ఇమ్మానుయేల్‌ పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో ఓ వీడియోను విడుదల చేశాడు. ఇమ్మానుయేల్‌ పోస్ట్‌ చేసిన వీడియో కింద నెటిజన్లు కామెంట్స్‌ బాగానే పెట్టారు. అన్నా నీ వీడియో బెంగుళూరు వరకు వచ్చిందంటూ ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. అలాగే అన్ని ఏరియాల నుంచి ఇలాగే కామెంట్స్‌ పెడుతున్నారు. బ్రతికుండగానే మనుషుల్ని చంపేస్తున్న కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.