English | Telugu

'సైంధవ్' సంక్రాంతికి రావడం కరెక్టేనా.. వెంకీ మామ రిస్క్ చేస్తున్నాడా?

సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే మేకర్స్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తే, ఎక్కువగా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే తన కెరీర్ లో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఘన విజయాలను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్.. వచ్చే సంక్రాంతికి మాత్రం యాక్షన్ సినిమాతో రిస్క్ చేస్తున్నారు.

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్'. మొదట ఈ సినిమాని డిసెంబర్ 22న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి ప్రభాస్ 'సలార్' వస్తుండటంతో.. 'సైంధవ్' సంక్రాంతికి వాయిదా పడింది. ఈ మూవీ 2024, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం', 'VD13'(ఫ్యామిలీ స్టార్), 'హనుమాన్', 'ఈగల్', 'నా సామి రంగ' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ లిస్టులో 'సైంధవ్' కూడా చేరింది. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్నదే అనుమానం.

సంక్రాంతి పండుగ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా కుటుంబమంతా కలిసి ఆనందించదగ్గ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో 2024 సంక్రాంతికి ప్రేక్షకులు ఎక్కువగా 'గుంటూరు కారం', 'ఫ్యామిలీ స్టార్', 'హనుమాన్' వంటి సినిమాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే 'సైంధవ్'కి పరాభవం తప్పదు. నిజానికి 'సైంధవ్'పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ లో వయలెన్స్ ఎక్కువగా ఉంది. మిగతా సమయంలో ఏమో కానీ.. ఫ్యామిలీ సినిమాలను చూడటానికి ఇష్టపడే సంక్రాంతి సీజన్ లో ఇలాంటి యాక్షన్ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానం ఉంది. మరి 'సైంధవ్'తో సక్సెస్ కొట్టి వెంకీ మామ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తాడేమో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.