English | Telugu

గుడ్ బై చెప్పనున్న ఇలియానా 

ఇలియానా.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు కుర్రకారు కలల యువరాణి గా తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన అందాల భామ. అలాగే ఇలియానా లాగా స్లిమ్ గా ఉండాలని ట్రై చేసిన అమ్మాయిలు కూడా ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు అందరి టాప్ హీరోల సరసన నటించిన ఇలియానా కి సౌత్ మొత్తంలోనే కోటి రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్న రికార్డు ఉంది. తన కంటు సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకున్న ఇలియానా గురించి వస్తున్న ఒక న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ఇలియానా తన సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తన భర్తని మాత్రం ఒక పిల్లవాడు పుట్టాకే అందరికి పరిచయం చేసింది. ఇప్పుడు ఇలియానా ఇండియా నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుందనే ప్రచారం జరుగుతుంది. ఆమె పెళ్లి చేసుకున్న మైకల్ డొలాన్ అమెరికా పౌరుడు కావడంతో ఇలియానా అక్కడే సెటిల్ అవ్వబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుగులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్,ప్రభాస్, అల్లు అర్జున్ ,రవితేజ, రామ్ పోతినేని వంటి టాప్ హీరోలందరి సరసన నటించింది.

తెలుగు సినిమా పరిశ్రమలో తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి రణబీర్, సైఫ్ అలీ ఖాన్ , వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, గోవింద, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి బడా నటులతో కలిసి నటించింది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు లేక మళ్ళీ తెలుగు లో కొన్ని సినిమాలు చేసింది.కానీ సరైన బ్రేక్ వచ్చిన సినిమా ఏది లేక పోవడంతో నిర్మాతలు ఇలియాని పట్టించుకోవడం మానేశారు. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కలిపి మొత్తం 30 సినిమాలకి పైగా నటించిన ఇలియానా ఉత్తమ నటి కేటగిరిలో ఎన్నో అవార్డుల్ని సైతం గెలుచుకుంది. ఇలియానా ఇండియా వదిలి వెళ్లిపోతుందనే వార్తలతో ఆమె అభిమానులు మాత్రం ఇలియానా ఇక్కడే ఉండి మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.