English | Telugu

హరిహర వీరమల్లు పై హైపర్ ఆది కామెంట్స్ 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మొదటిసారి చేసిన చారిత్రాత్మక చిత్రం 'హరిహరవీరమల్లు'(Harihara Veeramallu)ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ ప్రదర్శించడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొని ఉంది. రీసెంట్ గా ప్రముఖ నటుడు 'హైపర్ ఆది'(Hyper Aadi)సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసాడు.

అందులో ఆయన మాట్లాడుతు నిన్నరాత్రి 'హరిహరవీరమల్లు' ప్రీమియర్ షో చూసాను. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ తో పాటు థియేటర్ కి వెళ్లి చూడండి. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కే మీరు తెచ్చుకున్న పేపర్స్ మొత్తం అయిపోతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ గారు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్, కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు నేను సెట్స్ కి వెళ్ళాను. అభిమానులకి నచ్చేలా సినిమా అందించాలని, ప్రతి సీన్ విషయంలో పవన్ చాలా జాగ్రత్త తీసుకోవడాన్ని గమనించాను. అది ఈ రోజు స్క్రీన్ పై కనిపించిందని చెప్పుకొచ్చాడు.

వీరమల్లు కి 'క్రిష్',(Krish),'జ్యోతికృష్ణ'(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించగా 'ఏఎంరత్నం'(Am Rathnam)ఆయన సోదరుడు 'దయాకర్'(Dayakar) భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ భారీ తనం మొత్తం స్క్రీన్ పై కనపడుతుందని మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు. ఔరంగ జేబుగా బాబీడియోల్(Bobby deol)పంచమిగా నిధి అగర్వాల్(Nidhhi Agerwal)తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారని, మిగతా పాత్రల్లో చేసిన నటినటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారని చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు. కీరవాణి(Keeravani)అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీరమల్లు కి అదనపు బలాన్ని ఇచ్చిందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.