English | Telugu

తెలుగు హీరోయిన్‌‌కి కోలీవుడ్‌ కష్టాలు


కష్టజీవి శ్రీదివ్యకు కొత్త కష్టం వచ్చింది. బాలనటిగా ప్రిన్స్ మహేష్ సినిమాలో నటించిన తెలుగమ్మాయి శ్రీదివ్యకు కోలీవుడ్ లో ప్రస్తుతం చాలా అవకాశాలున్నాయి. తెలుగులో మల్లెలతీరం, బస్‌స్టాప్ చిత్రాల్లో నటించిన శ్రీదివ్యకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కిన శ్రీదివ్వ తమిళ పరిశ్రమలో మంచి ఛాన్స్ లు వచ్చాయి. పెన్సిల్, ఈటి, తాణా ఇలా వరుసగా ఒకే ఏడాదిలో 7 సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో టాప్ హీరోల పక్కన కూడా శ్రీదివ్యకు అవకాశాలు వస్తున్నాయి. పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే విశాల్, విక్రమ్, ప్రభూ, జీవా వంటి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.


ఇలా 7 సినిమాలతో బిజీగా వున్న శ్రీదివ్యపై అక్కడి మీడియాలో కొత్త కథనాలు మొదలయ్యాయి. శ్రీదివ్య రెమ్యూనరేషన్ పెంచింది, దర్శకులను, నిర్మాతలను సతాయిస్తోంది, యూనిట్‌కి చుక్కలు చూపిస్తోంది అంటూ టాకు మొదలైందట. కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం చూసి శ్రీదివ్య షాకుకు గురైందట. ఆపై, "అవన్నీ నా మీద వస్తున్న పుకార్లే, ప్లీజ్ వాటిని నమ్మకండి" అంటూ ప్రకటన ఇచ్చిందట. సిన్సియర్ గా పనిచేసుకుంటున్న తనపై ఇలాంటి రూమర్లు రావటం ఎంతో ఆశ్చర్యంగా వుందంటోంది శ్రీదివ్య.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.