English | Telugu

బుల్లితెరపై అమల, నాగార్జున


‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర ప్రేక్షకలను ఆకట్టుకుంటున్న నాగార్జున బాటలో ఆయన సతీమణి అమల కూడా నడవబోతున్నారు. అమల అక్కినేని బుల్లితెర మీద నటనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. 90 దశకాల్లో హీరోయిన్‌గా దక్షిణాది భాషల్లో నటించిన అమల చాలా కాలంపాటు స్క్రీన్‌కి దూరంగా వున్నారు. ఈ మధ్యే తనకు నచ్చిన పాత్రలు వున్న ఒకటి, రెండు సినిమాల్లో ఆవిడ నటించారు. సినిమాలు అయినా సీరీయల్స్ అయినా ఏదైనా ప్రత్యేకత వున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు అమల. ఈ కోవలో వచ్చిన చక్కటి స్క్రిప్ట్ కావటంతో ఆమె ఒక తమిళ సీరియల్ ‍లో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆగస్టులో ప్రసారం కానున్న ఈ సీరియల్ లో ఆమె డాక్టర్‌గా నటిస్తున్నారు. గతంలో హీరోయిన్లుగా కొనసాగిన రమ్యకృష్ణ, ఇంద్రజ, మీనా, రాధిక ఇలా బుల్లితెరపై సీరియల్స్ నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు ఆ కోవలో అమల అక్కినేని కూడా చేరుతున్నారు. ఏమైనా, బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ నిన్నటి తరం హీరోయిన్లను అభిమానులకు మరలా దగ్గర చేస్తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.