English | Telugu

పోగొట్టుకున్నదాన్ని రాబట్టుకున్న హరీష్!!

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బ్లాస్టర్ తరువాత హరీష్ శంకర్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ ల లీగ్ లోకి వచ్చేశాడు. ఆ టైమ్ లో చాలా మంది టాలీవుడ్ టాప్ హీరోలు అతనితో పనిచేయడానికి రెడీ అయ్యారు కూడా. అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ చాన్స్ ఇవ్వడంతో రామయ్యా వస్తావయ్య సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు హరీష్.

ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఓకే అయినట్టు, అడ్వాన్స్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయి, సినిమా డమాల్ అవడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కూడా మా డబ్బు మాకు వెనక్కి ఇచ్చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో స్టార్ హీరోల దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఒప్పించే అవకాశం కూడా ఆయనకి లేకపోయింది.

లేటెస్ట్ గా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవడంతో అల్లు అర్జున్ తో సినిమాకి కూడా లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా చూసిన అల్లు అర్జున్ హరీష్ ని తన కోసం ఓ స్టొరీ సిద్దం చేయమన్నాడట. ఆల్రెడీ బన్నీ కోసం లైన్ రెడీ చేసిన హరీష్, పూర్తిస్థాయి స్క్రిప్టుని సిద్ధం చేసే పనిలో బిజీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీగా వున్న అల్లు అర్జున్..ఈ సినిమా తరువాత హరీష్ సినిమా చేసే అవకాశాలు ఎక్కువన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎక్కడి పోగొట్టుకున్న దానిని అక్కడే రాబట్టుకోవలన్న సూత్రాన్ని హరీష్ బాగానే ఫాలో అవుతున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.