English | Telugu

హరిహరవీరమల్లుకి మూడో హీరో 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)సుమారు మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు 'హరిహర వీరమల్లు' గా థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ప్రీమియర్ షో కూడా ప్రదర్శించడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా పవన్ కెరీర్ లోనే వీరమల్లు బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి జరిగిన ప్రమోషన్స్ లో పవన్ మాట్లాడుతు సంగీత దర్శకులు 'కీరవాణి' గారు లేకపోతే వీరమల్లు మూవీ లేదని, మేము డల్ గా ఉన్న ప్రతిసారి ఆయన ఇచ్చిన ఆర్ఆర్ తో కొత్త ఉత్సాహం వచ్చేదని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు మూవీ చూసిన ప్రేక్షకులు కీరవాణి(Keeravani)గురించి పవన్ చెప్పిన మాటలు అక్షర సత్యమని, తన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీరమల్లుకి చాలా ప్లస్ అయ్యాడని చెప్తున్నారు. మూవీలో అద్భుతంగా నటించిన మొదటి హీరో 'పవన్ కళ్యాణ్' అయితే, భారీ బడ్జెట్ తో నిర్మించి ఎన్నో వ్యయప్రయాసలని ఓర్చుకొని రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ ఏఎంరత్నం' (Am Rathnam)రెండో హీరో. మూడో హీరో కీరవాణి(Keeravani)అనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఔరంగ జేబు క్యారక్టర్ లో బాలీవుడ్ అగ్రనటుడు 'బాబీడియోల్' కనిపించిన వీరమల్లులో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ చేసింది. రఘుబాబు,సునీల్, సుబ్బరాజు, నాజర్, సత్యరాజ్ ఇతర పాత్రల్లో కనిపించగా క్రిష్ ,జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.