English | Telugu

నాలుగు రోజులు యాక్టివ్‌గా లేకపోతే చంపేస్తారా?

ఈమధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్ళిళ్ళు, విడాకులు... వంటి వార్తలు వైరల్‌ కావడం, తర్వాత అందులో నిజం లేదని సదరు సెలబ్రిటీలు ఖండిరచడం చాలా రొటీన్‌గా మారిపోయింది. అలాంటిదే మరో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. టీవీల్లోనూ, సినిమాల్లోనూ బిజీగా ఉంటూ, సోషల్‌ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్‌ చేసిన హరితేజ దాని తర్వాత మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. క్రమం తప్పకుండా సోషల్‌ మీడియాలో కనిపించే హరితేజ కొన్నిరోజులుగా అడ్రస్‌ లేదట. దీంతో అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. అందులో ప్రధానంగా హరితేజ భర్తతో విడాకులు తీసుకుందా? ఒకవేళ తీసుకుంటే... ఎందుకు, ఏమిటి, ఎలా.. అంటూ చర్చించుకుం టున్నారు.

ప్రస్తుతం హరితేజ ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో విడాకుల ప్రస్తావన రావడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. ఈమధ్య అభిమానులతో చిట్‌ చాట్‌ సెషన్‌ చేసింది. వారిలో ఒకరు.. మీరు భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ ‘నాలుగు రోజులు నెట్టింట యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే’ అంటూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. తన విడాకుల కామెంట్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న హరితేజ విడాకుల వార్తలో ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.