English | Telugu

సంక్రాంతికి అసలుసిసలైన బాక్సాఫీస్ వార్!

ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీరసింహారెడ్డి'తో బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలోకి దిగారు. వచ్చే ఏడాది సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. 2024 సంక్రాంతికి ఏకంగా నలుగురు స్టార్ హీరోలు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఇప్పటికే ఇద్దరు స్టార్ల సినిమాల విడుదల తేదీ ఖరారు కాగా, మరో రెండు సినిమాల తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2024, జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. భారీ సినిమా కాబట్టి చెప్పిన తేదీకి రావడం అనుమానమనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా ప్రస్తుతానికి సంక్రాంతి రేసులో ఉన్నట్లే.

'అతడు', 'ఖలేజా' తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా 'ఎస్ఎస్ఎంబి 28'(వర్కింగ్ టైటిల్). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2024, జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే ఇప్పటిదాకా సంక్రాంతి రేసులో రెండు చిత్రాలు అధికారికంగా ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ చేంజర్'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏవైనా కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైతే తప్ప ఎక్కువ శాతం సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేదంటే వేసవికి రావొచ్చు.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం ఖాయమనే చెప్పొచ్చు. మొత్తానికి 2024 సంక్రాంతికి కనీసం ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశముంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.