English | Telugu

ఈ దీపావళికి విజయ్ దేవరకొండ వస్తున్నాడా?

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నయా క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్. అసలు మేకర్స్ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అనౌన్స్ చెయ్యగానే విజయ్ అభిమానుల్లోను సినిమా అభిమానుల్లోను ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించినా తాజా వార్త విజయ్ అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది.

ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఆ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో అనే అప్ డేట్ ని కూడా చిత్ర బృందం ఈ దీపావళికి అనౌన్స్ చేస్తుందనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.

విజయ్ దేవరకొండ, పరశురామ్ ల కాంబినేషన్ లో ఇంతకు ముందుకు వచ్చిన గీత గోవిందం మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో అందరి తెలిసిందే. ఆ మూవీ సంచలన వసూళ్లతో ఎన్నో రికార్డులని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విజయ్ అభిమానులు చాలా గట్టిగానే నమ్ముతున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చెయ్యబోతున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.