English | Telugu

Bhagavanth Kesari : హిందీలో 'భగవంత్ కేసరి'.. బాలయ్య ఓన్ డబ్బింగ్!

నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై.. మూడు వారాల్లో రూ.70 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చి, బాలయ్యకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన 'భగవంత్ కేసరి' త్వరలో హిందీలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు.

"బాక్సాఫీస్ కా షేర్ సెలెబ్రేషన్స్" పేరుతో తాజాగా భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో భగవంత్ కేసరి హిందీలో విడుదల కాబోతుందని చెప్పారు. తనకు ప్రయోగాలు చేయడం ముందు నుంచి అలవాటని, అందులో భాగంగానే ఈ సినిమా కోసం మొట్టమొదటిసారి డబ్బింగ్ చెప్పానని తెలిపారు. ఈ సినిమా మన భాషా పటిమ ఏంటో, మన తెలుగువారి సత్తా ఏంటో తెలియచేస్తుందని బాలకృష్ణ అన్నారు.

తెలుగునాట ఘన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' హిందీలో కూడా ఆస్థాయి ఆదరణకు నోచుకుంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.