English | Telugu

సినిమా ఇక 29 రూపాయలకే.. ఆఫర్ ప్రకటించిన ప్రముఖ సంస్థ  

థియేటర్స్ ద్వారా 'సినిమా'(Cinema)అనేది ఎలా అయితే ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తుందో, ఓటిటి(Ott)వేదికగా కూడా అంతే వినోదాన్ని అందిస్తుంది. ఇందుకు ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి.. అలాంటి ఒక వేదికే ఈటీవీ గ్రూప్ సంస్థల నుంచి వచ్చిన 'ఈటీవీ విన్'(Etv Win). లెజండ్రీ పర్సన్ రామోజీరావు(Ramoji rao)గారి నేతృత్వంలో 2019 లో ప్రారంభమైన ఈటీవీ విన్ పలు కొత్త, పాత చిత్రాలని స్ట్రీమింగ్ కి ఉంచుతు కావాల్సినంత సినీ వినోదాన్ని అందిస్తుంది.

'ఈటీవీ విన్' సబ్ స్క్రిప్షన్ రేట్ 99 రూపాయిలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈటీవీ గ్రూప్ ప్రారంభించి 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు ఆ రేట్ ని 29 రూపాయలకే అందుబాటులోకి తెస్తుంది. సదరు రేటు ఈ నెల 23 నుంచి 29 వరకు మాత్రమే ఉండనుంది. ఏడాది ప్రీమియం ప్లాన్, 499 రూపాయలు. ప్రీమియం ప్లస్ ప్లాన్ 699 రూపాయలు యధావిధిగా ఉండనున్నాయి.

ప్రస్తుతం ఈటీవీ విన్ లో రీసెంట్ గా విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam)తో పాటు ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలి, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన పలు చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈటీవీ ద్వారా వచ్చిన ఎన్నో సీరియల్స్, ప్రోగ్రామ్స్ ని కూడా స్ట్రీమింగ్ కి ఉంచారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.