English | Telugu

త్రిబాణధారి బార్బరిక్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. దర్శకుడు మోహన్ శ్రీవత్స 

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై 'విజయ్ పాల్ రెడ్డి అడిదెల'(Adidhala VIjaypalreddy) నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’(tribanadhari barbarik). మోహన్ శ్రీవత్స(Mohan srivatsa)దర్శకత్వం వహించగా, సత్యరాజ్(Sathyaraj),ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. అగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌ తో మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ మేరకు దర్శకుడు మోహన్ శ్రీవత్స చిత్ర విశేషాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఇంతకు ముందు ఏం నేర్చుకున్నారు?
సినిమాల్లోకి రావాలని, దర్శకుడు కావాలన్నదే నా కల. సంగీతాన్ని కూడా నేర్చుకొని, ఎన్నో ఈవెంట్లలో పాటలు పాడాను. అదే నాకు ఇన్ని రోజులు తిండి పెట్టింది.

‘బార్బరిక్’ కథ ఎలా ఓకే అయింది?
నేను కథల్ని బాగా చెప్పడంతో పాటు, అద్భుతంగా నెరేషన్ ఇవ్వగలను. దీంతో ‘బార్బరిక్’ కథని నిర్మాతకు చెప్పిన వెంటనే నచ్చింది. మారుతి గారు నా కథ విని ఆశ్చర్యపోయారు. నెరేషన్‌తోనే ఆయన నన్ను నమ్మేశారు.

మారుతి(Maruthi)గారి సపోర్ట్ ఎలా ఉండేది?
మారుతి గారి జానర్‌లో ఉండే సినిమా కాదిది. కానీ ఈ కథను నేను పర్‌ఫెక్ట్‌గా నెరేట్ చేశాను. ఆ తరువాత యాభై శాతం షూటింగ్ చేశాను. ‘మహారాజా’ స్క్రీన్ ప్లే, టెంప్లెట్‌లో బార్బరిక్ ఉంటుంది. మహారాజా తరువాత మారుతి గారు మా ‘బార్బరిక్’ని ఎక్కువగా నమ్మారు.

సత్య రాజ్ గారి పాత్ర, ఆయన సహకారం ఎలా ఉండేది?
బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్దాన్ని జరిగేలా చేస్తారు. నార్త్‌లో బార్బరికుడు ఫాలోయింగ్ చాలా ఉంటుంది. సత్య రాజ్ గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. మేకప్‌ విషయంలో ఆయన్ని చాలా కష్టపెట్టాను.

‘బార్బరిక్’ చూసిన తరువాత మారుతి గారు ఏమైనా సలహాలు ఇచ్చారా?
‘రాజా సాబ్’ షూటింగ్‌లో మారుతి గారు బిజీగా ఉన్నా, మా ‘బార్బరిక్’ మూవీ కోసం చాలా పని చేశారు. మాకు ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు. ఆయన సహకారం ఎప్పుడూ మర్చిపోలేను.

ఉదయభాను గారి పాత్ర ఎలా ఉండబోతోంది?
‘బార్బరిక్’ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ‘బార్బరిక్’ కంటెంట్ బేస్డ్ మూవీ. ఇందులోని ప్రతీ పాత్రకు భిన్న పార్శ్యాలు ఉంటాయి. సత్య రాజ్ గారు, ఉదయభాను గారు, వశిష్ట గారు ఇలా అందరు అద్భుతంగా నటించారు.

‘బార్బరిక్’ కోసం ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌ను ఎందుకు తీసుకున్నారు?
నాకు మ్యూజిక్ మీద టచ్ ఉంది. ఆ విషయంలో ఆడియెన్స్ పల్స్ నాకు తెలుసు. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌తో నాకు మంచి బంధం ఉంది. మాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ కూడా అదిరిపోతుంది. కొత్తగా ఉండాలనే ఇలా బ్యాండ్‌ని తీసుకున్నాను.

‘బార్బరిక్’ విషయంలో నిర్మాత విజయ్ గారి సహకారం ఎలా ఉంది?
‘బార్బరిక్’ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారికి ఓ బడ్జెట్ ఇచ్చాను. మారుతి గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. విజయ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు అండగా నిలిచారు.

‘బార్బరిక్’ సినిమా ఎలా ఉంటుంది? ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతోన్నారు?
‘బార్బరిక్’ చిత్రంలో హీరో, విలన్ అని ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని పాత్రల్లోనూ అంతర్గిక యుద్దం జరుగుతుంటుంది. ఈ మూవీతో మంచి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అని చెప్పదల్చుకుంటున్నాను. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అందరినీ అలరించేలా మా చిత్రం ఉంటుందని మోహన్ శ్రీవత్స చెప్పుకొచ్చాడు.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.