English | Telugu

వార్-2 వల్ల యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఎంత నష్టమో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం 'వార్-2'. ఎన్టీఆర్, హృతిక్ వంటి బిగ్ స్టార్స్ కలిసి నటించడం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగం రూపొందిన సినిమా కావడంతో.. 'వార్-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పటిదాకా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో 400 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా చేస్తున్నాయి. అయితే 'వార్-2' సినిమా స్థాయికి, ఆ బడ్జెట్ కి.. ఆ వసూళ్లు సరిపోవు. అందుకే యశ్ రాజ్ ఫిలిమ్స్ కి భారీ నష్టం వచ్చిందని, కనీసం వంద కోట్లు నష్టపోయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది.

రెమ్యూనరేషన్స్ తో కలిపి 'వార్-2' మొత్తం బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు అయిందట. అయితే ఇందులో సగానికి పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ రూ.150 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.25 కోట్లతో.. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం రూ.225 కోట్లు వచ్చాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు స్టేట్స్ లో తప్ప మిగతా అన్ని చోట్లా సొంతంగా విడుదల చేసుకుంది యశ్ రాజ్ ఫిలిమ్స్. తెలుగు రైట్స్ ద్వారా రూ.80 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా రూ.120 కోట్ల షేర్ రాబట్టింది. అంటే థియేట్రికల్ ద్వారా రూ.200 కోట్లు వచ్చాయి. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి వైఆర్ఎఫ్ కి మొత్తం రూ.425 కోట్లు వచ్చాయని అంచనా.

రూ.400 కోట్ల బడ్జెట్ ని బట్టి చూస్తే.. రూ.425 కోట్లు రికవర్ అయ్యాయి కాబట్టి.. యశ్ రాజ్ ఫిలిమ్స్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే. అయితే తెలుగు రైట్స్ రూ.80 కోట్లకు తీసుకున్న నిర్మాత నాగవంశీ.. నష్టాలను చూడబోతున్నారు. దీంతో ఆయనకు రూ.22 కోట్లు రిటర్న్ ఇవ్వడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ ముందుకొచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఆ పరిహారంతో పాటు, సినిమా పబ్లిసిటీ ఖర్చులను కలుపుకుంటే.. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్వల్ప నష్టాలతోనే బయట పడినట్లు అంచనా. పైగా ఇటీవల వైఆర్ఎఫ్ నుంచి వచ్చిన 'సైయారా' అనే సినిమా ఏకంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో.. 'వార్-2' వల్ల వచ్చే స్వల్ప నష్టాలు ఆ సంస్థకు పెద్ద లెక్క కాదనే మాట వినిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.