English | Telugu

‘ఎర్రబస్సు' ఆడియో వచ్చేసింది

దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందుతున్న ‘ఎర్రబస్సు' సినిమా ఆడియో గ్రాండ్ గా రిలీజైంది. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందజేశారు.ఈవివి కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణముర్తి తొలి సిడిని 10,116రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని తుఫాన్ భాదితులకు విరాళం ఇస్తున్నట్టు దాసరి ప్రకటించారు. ఈ సంధర్బంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''అందరికి విష్ణులో యాక్షన్ హీరో కనబడితే నాకు శోభన్ బాబు కనిపిస్తాడు. ఈ సినిమా ద్వారా విష్ణు ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుస్తుంది. క్లైమాక్స్ లో నాతో పోటిపడి నటించాడు. నా బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఎర్రబస్సు’ ఒకటిగా నిలుస్తుంది'' అని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.