English | Telugu

ప్రివ్యూ చూపెట్టు ... హిట్టు చేపట్టు




సినిమా వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా విడుదలకు ముందు నిర్మాతలు, దర్శకులు, ముఖ్య తారాగణం తెగ టెన్షన్ పడుతుంటారు. కలెక్షన్లతో పాటు టాక్ ఎలా వుంటుంది అనే విషయంలో కూడా ఈ టెన్షన్ కొనసాగుతుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు కూడా 50 రోజులు ఆడే పరిస్థితి లేని ఈ రోజుల్లో నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగా వుంచుతున్నారు. సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో ప్రముఖులకు, సీనియర్లకు తమ సినిమా గురించి చెప్పటం, లేదా కొంత భాగాన్ని చూపించి సలహాలు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు సినిమా రూపకర్తలు. ఇక మీడియాతో సినిమా గురించి అంశాలు ఆచితూచి షేర్ చేసుకుంటున్నారు ఫిలిం మేకర్స్.
ఈ దశలో టాలీవుడ్ మరిచిపోయిన ఒక పాత విధానానికి ‘మనం’ సినిమా తిరగదోడింది. విడుదలకు ముందే సినీ ప్రముఖులకు, మీడియా కోసం ప్రీవ్యూ ఏర్పాటు చేసి వారి రెస్పాన్స్ తెలుసుకునే పద్ధతి మళ్లీ ముందుకొచ్చింది. దృశ్యం సినిమాకు కూడా ప్రీవ్యూ ఏర్పాటు చేశారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రానికి రెండు రోజుల ముందుగానే ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
సినిమా పై ఎంతో నమ్మకం వుంటే గాని ఈ పని ఈ రోజుల్లో చేయటం కష్టం అనే చెయ్యాలి. అదృష్ట వశాత్తు అలా ప్రీవ్యూ చేసిన మనం, దృశ్యం రెండు చిత్రాలకు రెస్పాన్స్ పాజిటివ్ గానే వచ్చింది. విడుదల అనంతరం పబ్లిక్ రెస్పాన్స్ వేచి చూడాల్సింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.