English | Telugu

దృశ్యం అందరూ చూడొచ్చు - సెన్సార్


మలయాళంలో సూపర్‌ హిట్‌ రీమేక్ చిత్రం ‘దృశ్యం’ సెన్సార్ ముగించుకున్నట్లు సమాచారం. వెంకటేష్, మీనా ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ట్రెయిలర్స్ చూసిన ప్రేక్షకులు ఇదొక చక్కటి
కుటుంబ తరహా చిత్రం అనే అంచనాకు వస్తున్నారు. సెన్సార్ అధికారులు కూడా ఈ చిత్రాన్ని చూసి అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ లభించిందని తెలుస్తోంది.

మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రకు తెలుగులో వెంకటేష్ ఎంతవరకూ న్యాయం చేశారనే విషయంపై భిన్న రకాల టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ఆ విషయం తేలాలంటే సినిమా విడుదల వరకూ వేచి వుండాల్సింది. ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.