English | Telugu

మహేష్ బాబు దూకుడు నైజాం ఎవరి సోంతం...?

మహేష్ బాబు "దూకుడు" నైజాం ఎవరి సోంతం...? కాబోతోందాని సినీ పరిశ్రమ యావత్తూ ఆసక్తిగా ఎదురు చుస్తూంది. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలసి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దూకుడు". మహేష్ బాబు "దూకుడు" చిత్రం యొక్క నైజాం పంపిణీ చేసే హక్కులు ఎవరి సొంతం అవుతాయనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అయితే మహేష్ బాబు "దూకుడు" చిత్రం యొక్క నైజాం పంపిణీ చేసే హక్కుల కోసం చాలామంది పోటీపడుతున్నారని తెలిసింది.

ఏషియన్ ఫిలింస్ తరపున సునీల్ నారంగ్, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ తరపున డాక్టర్ వెంకట్, గీతా ఆర్ట్స్ తరపున "ఠాగూర్" మధు, అల్లు అరవింద్ లిద్దరూ పోటీ పడుతున్నారట. మహేష్ బాబు "దూకుడు" చిత్రం యొక్క నైజాం పంపిణీ చేసే హక్కుల కోసం ఎనిమిది కోట్ల వరకూ ఇవ్వటానికి వీరంతా సిద్ధపడుతుండగా, ఆ సినిమాని 10 కోట్లకు తక్కువకు ఇవ్వమని నిర్మాతలంటున్నారట. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ డాక్టర్ వెంకట్ ఇప్పటికే "ఊసరవెల్లి, దడ" చిత్రాల ప౦పిణీ హక్కులను పొంది ఉన్నారు. కనుక "ఖలేజా" పంపిణీ చేసి దెబ్బతిన్నగీతా ఆర్ట్స్ వారికే ఈ సినిమా హక్కులు లభించే అవకాశాలున్నాయట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.