English | Telugu

చిత్ర సీమలో విషాదం.. 'నిరీక్షణ' దర్శకుడు కన్నుమూత!

తెలుగు చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. మూవీ మొఘల్ డి. రామానాయుడు పరిచయం చేసిన దర్శకుల్లో ఒకరైన సీతారామ్ (49) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఎన్. ఎస్. ఆర్. ప్రసాద్ గానూ పరిచితుడైన సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం.

సినిమాల మీద ఆసక్తితో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రచయితగా, ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు సీతారామ్. ఆ అనుభవంతోనే రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' (2005) కోసం మొదటి సారిగా మెగాఫోన్ పట్టారు. ఆర్యన్ రాజేశ్, శ్రీదేవి విజయ్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం తరువాత.. శ్రీకాంత్ తో 'శత్రువు', నవదీప్ తో 'నటుడు' సినిమాలను తెరకెక్కించారు. ఇక సీతారామ్ దర్శకత్వంలోనే రూపొందిన కొత్త చిత్రం 'రెక్కీ' విడుదలకు సిద్ధమైంది. సీతారామ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.