English | Telugu

తెలంగాణ నూతన ప్రభుత్వానికి టాలీవుడ్ దర్శకుడి విన్నపం!

ఎన్ని ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ లో వర్షం పడితే రోడ్లు నదుల్లా మారిపోవడం, ట్రాఫిక్ కష్టాలు తీరకపోవడం కామన్ అయిపొయింది. దీంతో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో వినతి పత్రం ఇచ్చాడు. అలాగే సినీ పరిశ్రమని, కళాకారులని పట్టించుకోవాలని కోరాడు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం తరపున సినిమా వారికి అవార్డులు ఇవ్వడం లేదు. దీనిని కూడా కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

"వర్షాల తరువాత నిండే రోడ్లను మరియు పొంగే నాళాల సమస్యను మీ టర్మ్ లో వీలైనంత తొందరగా పరిష్కరించగలరు. ప్రజాప్రతినిధుల కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్టుగానే అంబులెన్సులకు కూడా క్లియర్ చేయిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడిన వారువుతారు. ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద పసి పిల్లలతో బిక్షాటన చేయించే వారిని కఠినంగా శిక్షించగలరు. ప్రతి కూడలి వద్ద పరిశుభ్రమైన నీటి వసతిని ఏర్పాటు చెయ్యగలరు. అలాగే పరిశుభ్రమైన టాయ్లెట్లని కట్టించగలరు. రోడ్ల మీద బాగా దూరం వెళ్లి తీసుకునే యూ-టర్న్ ల యొక్క దూరాన్ని తగ్గించగలరు. పార్కింగ్ చోట్లను పెంచగలరు." అంటూ హైదరాబాద్ వాసి పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరాడు.

ఇక సినిమా అంశాలపై స్పందిస్తూ.. "తెలంగాణ రాష్ట్ర సినిమా అవార్డులను మరియు ఫిల్మ్ ఫెస్టివల్స్ ని మొదలు పెట్టగలరు. ప్రత్యేకమైన ఫిల్మ్ స్కూల్ ని ప్రారంభించగలరు. కళాకారులూ, సాంకేతిక నిపుణులు ఎక్కువగా ఉండే కృష్ణానగర్ మరియు మణికొండ ప్రాంతాల దగ్గర్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఆడిటోరియాలు కట్టించగలరు. తెలంగాణ సినిమాలకు, చిన్న సినిమాలకు, పిల్లల సినిమాలకు ప్రభుత్వ సబ్సిడి మరియు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వగలరు. అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు మరియు పాత్రికేయులకు మీ పద్ధతుల ప్రకారం ఇళ్ళు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంసృతిక వారసత్వానికి మరియు చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడగలరు." అంటూ సినిమా వ్యక్తి పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరాడు. మరి దర్శకుడు సంజీవ్ రెడ్డి వినతి పత్రం ప్రభుత్వం దృష్టికి వెళ్లి.. ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి.

కాగా దర్శకుడు సంజీవ్ రెడ్డి 'ఏబీసీడీ' అనే సినిమాతో పాటు 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్ చేశాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.