English | Telugu

ఒక పాయింట్ దగ్గర డైవర్ట్ అయ్యాడు

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)రీసెంట్ గా 'హృతిక్ రోషన్' తో కలిసి వార్ 2(War 2)తో థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హిందీ కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా, తెలుగుతో పాటు మిగతా చోట్ల పర్వాలేదనే స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఎన్టీఆర్ సెప్టెంబర్ నుంచి 'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)తో జరుగుతున్న కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. త్రివిక్రమ్ మూవీ కూడా 'ఎన్టీఆర్' సినిమాల లైనప్ లో ఉన్న విషయం తెలిసిందే.


రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు వి. సముద్ర(V. samudra)తెలుగు వన్(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'బాలయ్యబాబు, ఎన్టీఆర్ తో నేను సినిమాలు చెయ్యకపోయినా, ఆ ఇద్దరితో మంచి రిలేషన్ ఉంది. ఆ ఇద్దరికి ఇప్పటికి నేనంటే నమ్మకం. ఎన్టీఆర్ నేను బాగా కలిసే వాళ్ళం. హరికృష్ణ(Harikirshna)గారితో సినిమా చేస్తున్నపుడు షూటింగ్ కి వచ్చే వారు. ఆ టైం లో ఎన్టీఆర్ కి కథ చెప్పాను. నేను తెరకెక్కిచిన కథలు కూడా చాలానే విన్నారు. కథలో ఒక పాయింట్ దగ్గర సముద్ర డైవర్ట్ అయ్యాడు. కానీ అద్భుతంగా చేసాడని ఎన్టీఆర్ చెప్పేవారు. ఇప్పటికి తన వాళ్ళ దగ్గర సముద్ర మంచి డైరెక్టర్ అని చెప్తారు. 'మహానంది' సినిమా కథ ఎన్టీఆర్ కోసమే రాసుకున్నానని సముద్ర చెప్పుకొచ్చాడు.

సముద్ర, హరికృష్ణ గారి కాంబోలో శివరామరాజు, టైగర్ హరిచంద్ర ప్రసాద్ లాంటి సినిమాలు వచ్చి ఒక దాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాయి. ఇక మహానంది మూవీలో సుమంత్, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించగా అనుష్క హీరోయిన్ గా చేసింది. అనసూయ దేవి నిర్మించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.