English | Telugu

రజినీకాంత్ కి షిఫ్ట్ అయిన నాగ్ అశ్విన్.. మరి ప్రభాస్..?

ఇటీవల 'కూలీ'తో ప్రేక్షకులకు పలకరించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్-2' చేస్తున్నారు. అలాగే పలువురు దర్శకులు రజినీకాంత్ కి కథలు వినిపిస్తున్నారు. ఇటీవల 'కంగువా' ఫేమ్ శివ దర్శకత్వంలో రజినీ ఓ సినిమా చేయనున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది.

'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి', 'కల్కి 2898 AD' సినిమాలతో ఎంతో పేరు సంపాదించారు. నిజానికి నాగ్ అశ్విన్ 'కల్కి-2' చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం చాలా రోజులు ఎదురుచూడాలి. అందుకే ఈలోపు మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు నాగ్ అశ్విన్. ఆ మధ్య అలియా భట్ తో ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల రజినీకాంత్ ను కలిసి నాగ్ అశ్విన్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. దానికి ఇంప్రెస్ అయిన రజినీ.. కంప్లీట్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట.

టాలీవుడ్ కి చెందిన బాబీ, వశిష్ఠ, వివేక్ ఆత్రేయ వంటి దర్శకులు కూడా గతంలో రజినీకాంత్ కి కథలు చెప్పారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ లు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మాత్రం కార్యరూపం దాల్చే అవకాశముందని అంటున్నారు. అదే జరిగి రజినీకాంత్ తో నాగ్ అశ్విన్ సినిమా చేస్తే మాత్రం.. 'కల్కి-2' అనుకున్న దానికన్నా ఎక్కువ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .