English | Telugu

కన్నడ పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ యాక్టర్ కన్నుమూత!

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దినేష్ వయసు 55 సంవత్సరాలు.

కేజీఎఫ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దినేష్ మంగళూరు సుపరిచితమే. ఆ సినిమాలో ఆయన ముంబై డాన్ శెట్టి పాత్రలో నటించారు. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తనదైన నటనతో మెప్పించారు. కిచ్చా, కిరిక్ పార్టీ వంటి చిత్రాలలో కూడా దినేష్ నటించారు.

మొదట కాంతార సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం పాలైన దినేష్.. బెంగళూరులో చికిత్స పొంది కోలుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇటీవల మళ్ళీ అనారోగ్యానికి గురై.. ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

నటుడిగా మారకముందు కన్నడలో దినేష్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్. ప్రార్థన, తుగ్లక్, బెట్టాడ జీవ, సూర్య కాంతి, రావణతో పాటు ఎన్నో సినిమాలకు వర్క్ చేసి గొప్ప పేరు పొందారు.

దినేష్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.