English | Telugu

‘పుష్ప2’లో అది మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌: దేవిశ్రీ ప్రసాద్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, నేషనల్‌ అవార్డులను సైతం గెలుచుకున్న ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2’ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా రెండో భాగాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత సుకుమార్‌పై ఉంది. దానికి తగ్గట్టుగానే సుకుమార్‌ ఎంతో కృషి చేస్తున్నాడు. సినిమా ఔట్‌పుట్‌ మామూలుగా వుండదని యూనిట్‌ మెంబర్స్‌ చెబుతున్నారు.

ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అంశాలను అందరితో పంచుకున్నారు. ‘‘పుష్ప2’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో నేను కూడా అంతే ఆసక్తితో సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా గురించి ఏం చెప్పినా, ఏం చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీరెవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇదొక అద్భుతమైన స్క్రిప్ట్‌. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌ ఉంటుంది. మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఆ సీక్వెన్స్‌కి సంబంధించిన విజువల్స్‌ చూశాను. మీరంతా ఆ సీక్వెన్స్‌ చూసి సర్‌ప్రైజ్‌ అవుతారు. ఇంతకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను’ అంటూ సినిమా గురించి ఎంతో ఎక్సైటింగ్‌ చెప్పారు దేవి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.