English | Telugu

ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ ఇక లేరు

బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోగా ఇప్పటికీ పిలువబడే దేవ్ సాబ్ నిన్నరాత్రి లండన్ లో గుండెనొప్పితో మరణించారు.మరణించేనాటికి ఆయన వయసు 88 సంవత్సరాలు. ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ లో నారోవాల్ జిల్లాలో, గురుదాస్పూర్ అనే గ్రామంలో, 1923లో సెప్టెంబర్ 26 వ తేదీన ఆయన జన్మించారు. లాహోర్ లో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ తీసుకుని, 1940 లో ఆయన బొంబాయికి వచ్చారు.

1946 లో "హమ్ ఏక్ హై" చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్ లోకి హీరోగా ప్రవేశించారు. ఆ తర్వాత ప్రముఖ గాయని, హీరోయిన్ అయిన సురయాతో ప్రేమలో పడ్డారు. ఆ రోజుల్లోనే 3 వేలు ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని ఆమెకు తన ప్రేమ కానుకగా బహూకరించారు. కానీ ఆమె ముస్లిమ్, దేవానంద్ హిందూ కావటంతో వారి వివాహానికి ఆమె తరపు పెద్దలు అంగీకరించలేదు. దానిఫలితంగా సురయా చనిపోయే వరకూ అవివాహితగానే ఉండిపోయారు.

దేవానంద్ నటించిన తొలి రంగుల చిత్రం "గైడ్" ఆయనకు స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. 119 చిత్రాల్లో హీరోగా నటించిన దేవానంద్ 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించగా 1971లో వచ్చిన "హరేరామ హరేకృష్ణ" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని "దమ్ మారో దమ్ మిట్ జాయే గమ్...బోలో సుభో శ్యామ్ హరే కృష్ణ హరే రామ్" అనే పాట ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.

ఆయనకు అయిదు అంతర్జాతీయ అవార్డులు, 25 జాతీయ అవార్డులు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులూ లభించాయి. ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు మరపురానివి. అటువంటి దేవానంద్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగువన్ కోరుకుంటోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.