English | Telugu

'దసరా' కలెక్షన్ల జోరు.. అయినా అక్కడ నష్టాలు తప్పవా!

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించిన ఈ మూవీ.. రెండో రోజు రూ.8.08 కోట్ల షేర్, మూడో రోజు రూ.9.18 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.38 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.14.22 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.86 కోట్ల షేర్, మూడో రోజు రూ.6.73 కోట్ల షేర్ వసూలు చేసిన దసరా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.26.81 కోట్ల షేర్(రూ.45.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.4.75 కోట్ల షేర్, ఓవర్సీస్ రూ.6.70 కోట్ల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.38.26 కోట్ల షేర్(రూ.68.45 కోట్ల గ్రాస్) సాధించింది. ఓవరాల్ గా రూ.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశముంది. నాలుగో రోజు ఆదివారం కావడంతో వరల్డ్ వైడ్ గా మరో పది కోట్ల షేర్ కోట్ల రాబట్టి.. నాలుగు రోజుల్లో రూ.48 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాకాశాలు ఉన్నాయి.

దసరా మూవీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయమే అయినప్పటికీ.. ఏరియాల వారీగా చూస్తే కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టాలు తప్పవేమో అనిపిస్తుంది. తెలంగాణ, ఓవర్సీస్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న దసరా.. ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. నైజాం(తెలంగాణ)లో రూ.13.7 కోట్ల బిజినెస్ చేసిన మూవీ.. మూడు రోజుల్లోనే రూ.14.37 కోట్ల షేర్ రాబట్టి అప్పుడే లాభాల్లోకి ఎంటరైంది. సీడెడ్ లో రూ.6.5 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పటిదాకా రూ.3.83 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఆంధ్రాలో రూ.14.45 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటిదాకా రూ.8.61 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఆశించిన స్థాయిలో దసరా వసూళ్లు లేవు. పైగా వచ్చే శుక్రవారం రావణాసుర, మీటర్ వంటి సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈలోపు దసరా పుంజుకొని ఆంధ్రాలోనూ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.